పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించారు.దేశ ఐక్యతను కాపాడటానికి అందరు కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.