minister seethaka serious on fake attendance: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో నకిలీ హాజరు వ్యవహారం కలకలం రేపింది. ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించి వందల మంది కార్యదర్శులు తప్పుడు హాజరు నమోదు చేశారు. మంత్రి సీతక్క సీరియస్ కావడంతో 553 మంది కార్యదర్శులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. కొందరిని సస్పెండ్ చేయగా, ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా పంచాయతీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.