Funds For Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నిధులు విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెలలోనే నిధులు విడుదల చేయగా తాజాగా మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ. 548.28 కోట్లు విడుదల చేయడం విశేషం. ఈ నిధులతో గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుద్దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విశాఖ జిల్లాకు రూ. 60 కోట్లు కేటాయించారు.