తెలంగాణ పంచాయతీల్లో కొత్త పంచాయితీలు నెలకొంటున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి పాత సర్పంచ్లు, కొత్త సర్పంచ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. తాము అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని.. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులను పెండింగ్ బిల్లులు చెల్లింపుల కింద ఇవ్వాలని పాత సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకే నిధులన్నీ అయితే అభివృద్ధి ఏం చేయాలంటూ కొత్త సర్పంచ్లు తలలు పట్టుకుంటున్నారు.