భార్య, భర్త, ఇద్దరు కుమారులు.. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఈ కుటుంబం.. ఉగాది పండుగ రోజున ఈ లోకాన్ని వీడింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. నలుగురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుండెల్ని పిండేసే ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బజారులో నివాసం ఉండే బంగారం వ్యాపారి, తన భార్య, ఇద్దరు పిల్లలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.