నల్గొండ జిల్లా చందంపేట మండలం పరిధిలోని దేవరచర్ల గ్రామంలో దసరా పండుగ వేళ ఘోరం జరిగింది. దిండి వాగులో కొట్టుకుపోతున్న 10 ఏళ్ల బాలుడు సాయి ఉమాకాంత్ను రక్షించబోయిన రాము (30), గోప (21) అనే ఇద్దరు యువకులు ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందారు. వీరిలో రాము ఎంబీబీఎస్ విద్యార్థి.. బంధువుల ఇంటికి వచ్చిన వీరు చేసిన ఈ సాహసం ప్రాణత్యాగంగా మారింది. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో.. గ్రామంలో శోక వాతావరణం నెలకొంది.