కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వాంకిడి మండలం, బెండారం గ్రామానికి చెందిన జగన్ (27), అతని సోదరి అనసూయ (32), ప్రజ్ఞశీల్ (4) కారు ఢీకొని మృతి చెందారు. దీపావళి కోసం సోదరిని తీసుకువెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరో చిన్నారికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.