కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 98 స్థానాల్లో ఆధిక్యంతో ప్రభంజనం సృష్టిస్తోంది. 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనకు చరమగీతం పాడుతూ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఎయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన 'నీ పో మోనే విజయ్' అనే వ్యాఖ్యలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం పినరయి విజయన్తో సహా పలువురు మంత్రులు ఓటమి దిశగా సాగుతుండగా.. రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకుని, కేరళలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు.