గ్రామాల్లో మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లోనూ నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పట్టణాల్లోనూ భూమిలేని కూలీలు ఉన్నారని.. వారికి కూడా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.