ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రేపటితో జిల్లాలో సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికొనుగోళ్లు బంద్ కానున్నట్లు చెప్పారు. ఇంకా రైతులు ఎవరైనా పత్తిని అమ్మాలనుకుంటే రేపటితో అమ్మకాలు చేసి మద్దతు ధర పొందాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.583.23 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.