వర్షాల వల్ల తడిసిన పత్తిని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తేమ శాతం నిబంధనను సడలించి, రైతులు దళారుల వద్ద మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్ల తర్వాత మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.