తెలంగాణ పత్తి రైతులకు శుభవార్త. ఈ నెల 22 నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. జిన్నింగ్ మిల్లుల జాబ్వర్క్ టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మిల్లర్లు, సీసీఐ మధ్య వివాదాలు పరిష్కారమయ్యాయి. అక్టోబర్ 10న టెండర్లు తెరవగా... జిన్నింగ్ ధరలపై నేడు చర్చలు జరగనున్నాయి. ఈ నెల 19లోగా ప్రక్రియ పూర్తి చేసి.. 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.