హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జెప్టో, స్విగ్గీ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడం, పరిశుభ్రత లోపించడంతో పాటు నాసిరకం వస్తువులు డెలివరీ అవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. స్టోర్లలో ఈగలు, దోమలు విపరీతంగా ఉండటం, సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. సేకరించిన ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. వినియోగదారులు ఆహారం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.