హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన ఏఐ ఫోటో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ రీట్వీట్పై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన స్మితా.. 2000 మంది రీట్వీట్ చేసినా తనను మాత్రమే టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తాజాగా.. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్పందించారు. స్మితా బీఆర్ఎస్ యాక్టివిస్ట్లా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సివిల్ సర్వీసెస్లో ఇలాంటి రాజకీయ పోస్టులు సరికాదని హెచ్చరించారు.