పదేళ్ల నిరీక్షణకు తెర.. నిలోఫర్ ఆసుపత్రిలో అందుబాటులోకి జీ+3 భవనం.. ఇక కష్టాలు తీరినట్లే..

5 months ago 5
హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో దాదాపు పదేళ్లుగా మూసి ఉన్న రోగుల సహాయకుల వసతి గృహాన్ని తిరిగి తెరవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేదల అటెండర్లు బయట పడుతున్న ఇబ్బందులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. GHMC సహకారంతో నిర్మించిన ఈ 72 గదుల జీ+3 ధర్మశాల నిరుపయోగంగా ఉండటంపై ప్రశ్నించారు. దీంతో వైద్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెంటనే సమావేశం నిర్వహించి.. ఈ భవనాన్ని తక్షణమే రోగుల బంధువులకు వసతి కల్పించడానికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
Read Entire Article