Telangana Excise Department Promotion: తెలంగాణ ప్రభుత్వం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఈ అధికారులకు త్వరలోనే ప్రమోషన్లు దక్కనున్నాయి. డీసీలకు క్షేత్రస్థాయి తనిఖీ అధికారాలు కోల్పోతామనే కారణంతో కొందరు పదోన్నతులు వద్దని లేఖలు రాయడం వల్ల ఈ శాఖలో పదోన్నతులు ఆలస్యం అవుతూ వచ్చాయి. అయితే తాజాగా రేవంత్ సర్కార్ వీరికి పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.