Anantapur Govt School 10th Students Flight Journey: పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు విమానంలో టూర్ వేస్తానని అనంతపురం జిల్లా బెళుగుప్ప ఎంఈవో మల్లారెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 550 మార్కులు పైగా సాధించిన ఐదుగురు విద్యార్థినులను బెంగళూరు నుండి విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లి, నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూపించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రతిభ కనబరుస్తారని ఆయన అన్నారు. ఈ టూర్ ఖర్చును తానే భరిస్తానని తెలిపారు.