ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పరీక్షల మార్కుల విషయంలో ఈ సారి కూడా పాత విధానాన్నే కంటిన్యూ చేస్తామని తెలిపింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 100 మార్కుల సబ్జెక్టులో 80 మార్కులు మెయిన్ పరీక్షకు అంటే.. వార్షిక పరీక్ష 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఇక మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ పరీక్షల ద్వారా కేటాయిస్తారు. అంటే పాఠశాల టీచర్లే ఆయా సబ్జెక్టులకు 20 మార్కులను ఇంటర్నల్ మార్క్స్ కింద వేస్తారు.