పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం.. అయితే ఒక్క కండీషన్!

1 month ago 4
పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించింది. పదో తరగతి పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.హాల్ టికెట్లు చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే పరీక్షలు జరిగే రోజుల్లోనే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
Read Entire Article