హైదరాబాద్ నగర వాసులకు బిగ్ షాక్. ప్రజలకు అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత సేవల విధానాన్ని రద్దు చేసి, యూజర్ ఛార్జీలు వసూలు చేయనుంది. నిర్వహణ లోపం, నిధుల దుర్వినియోగం కారణంగా మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధానం ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపరచాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల సహకారం కూడా కోరుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.