తెలంగాణను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా.. నిర్మల్ జిల్లాను టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. చారిత్రక కోటలు, జలపాతాలు, అభయారణ్యాలను అభివృద్ధి చేయనున్నారు. బాసర నుంచి కవ్వాల్ వరకు టూరిజం కారిడార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పర్యాటక శాఖ ఛైర్మన్ రమేశ్ రెడ్డి తెలిపారు.