ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు దగ్గరగా చేరుకోవడంతో.. ప్రస్తుతం 587 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు, సందర్శకులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.