సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో 70 ఎకరాల్లో అడవిని సృష్టించిన పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపర్లు కర్రలతో దాడి చేశారు. తన అటవీ క్షేత్రంలో పశువులను మేపవద్దని వారించినందుకు గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబం సభ్యులతో కలిసి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ ప్రస్తుతం సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రకృతి ప్రేమికుడిపై జరిగిన ఈ దాడిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.