పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మె్ల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. లీగల్ అడ్వైజర్ నియామకానికి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఆయన నిరసనకు దిగటం చర్చనీయాంశమైంది. కొన్ని గంటలపాటు గదిలో బంధించుకుని, బయటకు రాకుండా ఉండటం కలకలం రేపింది. మరోవైపు గతేడాది కూడా ఇలాగే ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన వ్యవహరించిన తీరుపై అప్పట్లో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది.