పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలతో నడిపిన యవ్వారం అనుకోని విషాదానికి దారితీసింది. ఓ యువతి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ విషయం బయటకు రాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.