పల్నాడు జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు.. ఏకంగా 46 సవర్ల బంగారంతో పాటు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. చోరీకి గురైన మొత్తం సొత్తు విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.