ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పల్లెవెలుగు సర్వీసులకు కూడా ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పొన్నూరులో ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొత్తగా 1150 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పల్లె వెలుగు సర్వీసులకు కూడా ఏసీ బస్సులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.