ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా వెలగపూడిలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే సభావేదికపై పవన్ కళ్యాణ్కు మోదీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్కు మోదీ చాక్లెట్ ఇచ్చారని వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు మోదీ ఇచ్చింది చాక్లెట్ కాదంటూ జనసేన శ్రేణులు మరో వీడియో వైరల్ చేస్తున్నాయి.