డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పిఠాపురంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. పిఠాపురంలో. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, టీటీడీ కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. మరోవైపు ఉగ్రవాదుల చర్యలకు ముస్లిం సమాజాన్ని నిందించడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.