డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాజమండ్రిలోని ఏవీఏ కాలువ ముఖచిత్రమే మారిపోయింది. ఇటీవల రాజమండ్రిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆవ కాలువలో వ్యర్థాలను చూసి అధికారులపై మండిపడ్డారు. వెంటనే కాలువలోని వ్యర్థాలను తొలగించాలని.. మరోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోనే కాలువను శుభ్రపరిచారు అధికారులు. జేసీబీల సాయంతో కాలువలోని వ్యర్థాలను తొలగించారు.