హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, గుడివాడ అమర్నాథ్ వివాదం తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. దళిత మహిళ గురించి అహంకారంతో అమర్నాథ్ మాట్లాడారని.. ఇది ఏపీలోని మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే అనిత ఇష్టానుసారం మాట్లాడటంతో అమర్నాథ్ బదులిచ్చారని.. దీనికి రాష్ట్రంలోని మహిళలకు ఏం సంబంధమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.