Pawan Kalyan Son News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అరకు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని సింగపూర్ బయలుదేరారు. ఆయన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ను ఆసుపత్రిలో చేర్పించారు.. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దీంతో అరకు పర్యటనను రద్దు చేసుకుని పవన్ హుటాహుటిన సింగపూర్ వెళుతున్నారు.