వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (పద్మనాభరెడ్డి) సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని.. ప్రధానమంత్రి మోదీని ఏపీలో ఎమర్జెన్సీ పెట్టమని అడగాలంటూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. కాపు కులాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించండి అంటూ ముద్రగడ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ లేఖకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభరెడ్డికి బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ రాశారు.