బీజేపీ, జనసేన మధ్య ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉందని.. తెలంగాణలో కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ జనసేనతోపాటు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని వార్తలు వచ్చినా.. చివరి నిమిషంలో పవన్ టూర్ రద్దు అయింది. ఈ నేపథ్యంలోనే ధర్మపురి అర్వింద్ స్పందించారు. బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని తేల్చి చెప్పారు.