ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల కోనసీమపై చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఎప్పుడూ ఏపీ సంక్షేమాన్ని కోరుకుంటుందని.. రాష్ట్ర విభజన అభివృద్ధికి అడ్డంకి అనడం అవమానకరమని అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడితే సహించబోమని... పవన్ కల్యాణ్ తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన సూచించారు.