Grandhi Srinivas On Pawan Kalyan: భీమవరంలో పేకాట వ్యవహారంపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలనుకుంటున్నానని, అపాయింట్మెంట్ ఇస్తే అక్రమాలన్నీ చెబుతానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు క్లబ్లు, మద్యం షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు దొంగలెవరో పవన్ కళ్యాణ్కు తెలుసు అన్నారు గ్రంథి శ్రీనివాస్. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.