Saraswati Power Lands Registrations Cancel: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంతం నెగ్గింది.. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కు కేటాయించిన భూముల్లో ఉన్న అసెన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరస్వతి పవర్కు కేటాయించిన భూముల్లో అసైన్డ్, అటవీశాఖ భూములు ఉన్నాయనే ఆరోపణలపై విచారణ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు అసైన్డ్ భూముల్ని గుర్తించి.. ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు.