ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పోల్చిన పవన్ కళ్యాణ్పై కేసు ఎందుకు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ వాదాన్ని పవన్ కళ్యాణ్ వేర్పాటువాదంతో పోల్చారని కవిత మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వేర్పాటువాదంపై ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు.