Mudragada Letter To Chandrababu Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని.. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టమని ప్రధాని మోదీని కోరాలన్నారు. తిరుపతి లడ్డూ ఎపిసోడ్ తర్వాత ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కాపు కులాన్ని అవమానిస్తున్నారని.. ఎప్పుడూ ఆ కులంపై రగిలిపోతూనే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.