Pawan Kalyan Morphing Photos: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం యోగా దినోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి, తప్పుగా పోస్టులు పెట్టారని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కర్రి వెంకట సాయివర్మ, పాముల రామాంజనేయులు, షేక్ మహబూబ్ ఉన్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.