బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బీజేపీ తీరును తప్పుబడుతూ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సోదరులు ఎప్పుడూ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయలేదా? అంటూ కేఏ పాల్ ఈడీని ప్రశ్నించారు.