నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రంలోకి భారీగా మద్యం, మాంసం తరలించేందుకు ప్రయత్నించిన దుండగులను టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండపైకి మాంసం, మద్యాన్ని తీసుకెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి చర్యలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల శ్రీశైలం పరిధిలో పట్టుకున్న మద్యం, డ్రగ్స్ను పోలీసులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2 వందల కిలోల మాంసం పట్టుబడింది.