పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. తిరుమలలో క్యాబ్ డ్రైవర్లతో టీటీడీ విజిలెన్స్ విభాగం సమావేశమైంది. భక్తుల భద్రత కోసం ఎలా వ్యవహరించాలనే దానిపై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు.. క్యాబ్ డ్రైవర్లకు వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురావాలని ప్రయత్నించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తిరుమలలో ఎలా నడుచుకోవాలనే దానిపై వారికి అవగాహన కల్పించారు.