Pawan Kalyan Rs 50 Lakhs To Madhusudan Family: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళగిరిలో సంతాప సభ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెల్లూరుకు చెందిన మధుసూదన్రావు కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని, దేశ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్కు అనుకూలంగా మాట్లాడేవారిని ఆయన తీవ్రంగా ఖండించారు.