KA Paul On Pahalgam Attack: పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా నిఘా వర్గాల వద్ద దాడికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను ప్రధాని మోదీ, వైట్హౌస్ అనుమతితో పాకిస్తాన్ వెళ్లి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదుర్చుతానని పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.