భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ యవకుడు సోషల్ మీడియా వేదికగా పాక్కు మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టాడు. హైదరాబాద్ శివారు పాలమాకుల గ్రామానికి చెందిన సయ్యద్ ఇక్రముద్దీన్(25) అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టగా.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు. పోస్టు పెట్టిన యువకుడిపై కేసు బుక్ చేశారు.దేశ వ్యతిరేక పోస్టులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని.. సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.