తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించిన నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి గాను, తొలి విడత కింద 50 శాతం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాకు సుమారు రూ. 71.07 లక్షలు కేటాయించారు. ఈ నిధులను ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీలు సంయుక్త తీర్మానంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. తరగతి గదుల మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ పరికరాల కొనుగోలు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించవచ్చు. ఇది పాఠశాల నిర్వహణ సమస్యలను కొంతమేర తీర్చనుంది.