శ్రీకాకుళం జిల్లాలో బండపల్లిలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు వారితో తరగతి గదిలో కాళ్లు పట్టించుకున్న వైనం వెలుగుచూసింది. ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశం కాగా.. అధికారులు ఆ ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆమెపై విచారణకు ఆదేశిస్తూ.. సస్పెండ్ చేసినట్లు తెలిసింది.