హైదరాబాద్ సికింద్రాబాద్లో ఓ పాడుబడిన గోదాములో కట్టల కొద్దీ డబ్బు బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా దాడి చేసి రూ.8 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలలో డబ్బు నింపే ప్రైవేట్ సంస్థ నిర్లక్ష్యంగా డబ్బు దాచిపెట్టిందని తేలింది. అసలు ఈ డబ్బు ఎవరిది? గోదాంలోకి ఎలా చేరింది? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.