టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో పర్యటించారు. కిమ్స్ ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవం కోసం జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్కు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జునియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెజెంటర్ అడిగిన ప్రశ్నకు జూనియర్ ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.